21 March, 2026 | 8:07 PM

ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర

21-03-2026 06:46 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా మారుమూల మండలం పెంబిలోని ఆదివాసి గిరిజనగూడాలో ఆదివాసులకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ సిపిఎం పార్టీ శనివారం పాదయాత్ర నిర్వహించింది. మండలంలోని ఆదివాసి గూడెం లో ఉంటున్న వారికి తాగునీరు విద్య వైద్యం రవాణా సదుపాయం కల్పించాలని వాగులపై బ్రిడ్జిలు నిర్మించాలని అటవీశాఖ అధికారులు ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్ర నిర్వహించారు. పెండి మండలంలోని యాపాలగూడ నుండి ఈ పాదయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సురేష్ సచిన్ గౌతమ్ కృష్ణ నూతన కుమార్ తిరుపతి ధర్మన్న శంభో తదితరులు పాల్గొన్నారు.