12 July, 2026 | 2:53 PM

Breaking News

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •  

ఫైర్ సేఫ్టీ అందరి బాధ్యత

05-02-2026 12:45 AM

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

సికింద్రాబాద్ ఫిబ్రవరి 4 (విజయ క్రాంతి): రానున్నది వేసవి కాలం. నిప్పు రగిలితే మంటలు వ్యాపించి భారీ మొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తుంది. ఇలాంటి తరుణంలో ప్రతి ఒక్కరూ ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పటికే హైడ్రా తనిఖీలు చేసి కొన్ని షాపులను సీజ్ చేయడమైంది. నెల రోజులు వ్యవధి కావాలని షాపుల యజమానులు, వ్యాపార సంఘాలకు చెందిన ప్రతినిధులు విజ్ఞప్తి చేయగా వారికి అనుకూలంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫిబ్రవరి నెలవరకూ సమయం ఇచ్చారు.

ఇదే సమయంలో అగ్ని ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలను హైడ్రా చేపట్టింది. నగర వ్యాప్తంగా మాక్ డ్రిల్స్, అవగాహన కార్యక్రమాలను సంబంధిత శాఖలతో కలిసి హైడ్రా పెద్దయెత్తున నిర్వహిస్తోంది. ఎవరికి వారు ఆలో చించి అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుం డా జాగ్రత్తలు తీసుకునేందుకు అనుసరించాల్సిన ప్రాథమిక అంశాలను తప్పకుండా పాటించాలని నగర ప్రజలకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ విజ్ఞప్తి చేశారు.