4 May, 2026 | 12:22 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం

22-12-2025 02:44 AM
  1. సుమారు మూడు కోట్ల ఆస్తి నష్టం
  2. కంగ్టి మండలంలో ఘటన

కంగ్టి, డిసెంబర్ 21(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తుర్కవడగం శివారులోని సమర్ద్ కోటేక్స్ కాటన్ మిల్లులో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. మినీ ట్రాక్టర్ ద్వారా పత్తిని తరలిస్తుండగా ట్రాక్టర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంట లు ఫ్యాక్టరీలోకి క్షణాల్లో వ్యాపించి, చుట్టు పక్కల ఉన్న పత్తికి అంటుకున్నాయి. దీంతో మంటలు భారీగా చెలరేగాయి. వెంటనే అగ్నిమపక సిబ్బందికి సమాచారం అందించారు.

మూడు ఫైర్ ఇంజన్లతో సంఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. సుమారు నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. సమాచారం అందుకున్న ఖేడ్ డీఎస్‌పీ వెంకటరెడ్డి, కంగ్టి సీఐ, ఎస్‌ఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నా రు. సుమారు మూడు కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు ఫ్యాక్టరీవారు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు లేకపోవడంతో ప్రాణ నష్టమూ జరగలేదు.