29 April, 2026 | 10:52 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

నిరుపేద చిందుల కళాకారుని కుటుంబానికి ఆర్థిక సహాయం

22-11-2025 12:00 AM

అర్మూర్, నవంబర్ 21 (విజయ క్రాంతి) : అర్మూర్ మండలం చేపూర్ గ్రామానికి చెందిన చిందుల కళాకారుడు చిందుల ఈశ్వర్ కుమారుడు రాజు అకాల మరణం చెందాడు. వీరిది నిరుపేద కుటుంబని, వీధి నాటకాలు ఆడటం వీధి. నాటకాలు లభించక వీరి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకొని చేపూర్ గ్రామానికి చెందిన చేపూర్ వాట్సాప్ గ్రూపులలో చూసి చేపూర్ గ్రామానికి చెందిన ప్రజలు, నాయకులు, ఉద్యోగులు, యువకులు, చేపూర్ ఎన్నారైలు, వ్యాపారస్తులు వారికి తోచినంత సహాయం చేశారు.

ఆర్థిక సహాయం ఫోన్ పే గూగుల్ పే ద్వారా చేయగా మొత్తం 51 వెయ్యిల రూపాయలను శుక్రవారం చేపూర్ గ్రామానికి చెందిన అంబేద్కర్ సంఘ సభ్యులు, మాజీ సొసైటీ డెరైక్టర్ సారంగి శాంతి కుమార్, మీనుగు రాజేశ్వర్, చేపూర్ విడిసి కోశాధికారి కొండ్ర రంజిత్ కుమార్, అంబేద్కర్ యూత్ సంఘం అధ్యక్షుడు మంగళారం కార్తీక్, మాజీ అంబేద్కర్ యూత్ అధ్యక్షులు సారంగీ రవి కిరణ్ ఈశ్వర్ కు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ ఉపాధ్యక్షులు, బి, సుధీర్ మంగళారం హరీష్, సారంగి అకిల్, కొనింటి అనిల్, చిందుల సురేష్ బాలేశ్వర్, రాము సత్య తదితరులు పాల్గొన్నారు.