calender_icon.png 14 February, 2026 | 11:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జడ్చర్ల-కోదాడ హైవేపై ఘోర ప్రమాదం

14-02-2026 10:33:19 AM

_ ముగ్గురు మృతి

కల్వకుర్తి ఫిబ్రవరి 14: జడ్చర్ల-కోదాడ హైవేపై శనివారం తెల్లవారుజామున ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి వద్ద తుఫాన్ వాహనం కల్వర్ట్ కు డీ కొని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా నుండి తుఫాన్ వాహనంలో శ్రీశైల దేవస్థానానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అందులో ప్రయాణిస్తున్న వారిలో రమణ గౌడ్ (52 )మేఘ దాసి (46 )మాధవి (60 )ముగ్గురు మృతి చెందారు తీవ్రంగా గాయపడిన పలువురిని వెల్దండ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పంచనామ నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వం తరలించారు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతో ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.