24 June, 2026 | 2:33 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

అకాల వర్షాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి

05-05-2026 12:00 AM

ఎస్‌ఐ చల్ల రాజు

వెంకటాపూర్, మే 4 (విజయక్రాంతి): అకాల వర్షాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్త్స్ర చల్ల రాజు అన్నారు. మండల కేంద్రం శివారులో ధాన్యం ఆరబోసిన రైతులతో స్థానిక ఎస్త్స్ర చల్ల రాజు మాట్లాడి పంట పరిస్థితులు, రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవికాలంలో ఉరుములు, మెరుపులు, గాలిదుమారంతో అకాల వర్షాలు కురిసే అవకాశమున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం వర్షంలో తడవకుండా తార్పాలిన్, పట్టాలు సిద్ధంగా ఉంచుకోవాలని,

తడిసిన ధాన్యం నాణ్యత తగ్గే ప్రమాదం ఉన్నందున సకాలంలో మా ర్కెట్లకు లేదా ఐకెపి కేంద్రాలకు తరలించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పొం దాలని సూచించారు. రోడ్లపై ధాన్యం ఆరబోసే చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని, వాహనదారుల భద్రత దృష్ట్యా అలాంటి చర్యలను నివారించాలని హెచ్చరించారు. నకిలీ విత్తనాలపై కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నమ్మకమైన డీలర్లు లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన వ్యవసా య కేంద్రాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. నకిలీ విత్తనాలపై సమాచారం ఉంటే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.