9 May, 2026 | 9:45 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

రైతుల ఆత్మహత్యలు ఆందోళనకరం

22-01-2026 01:48 AM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి) : తెలంగాణలో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకరమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభ పరిస్థితులు తెలంగాణ వ్యాప్తంగా నెలకొని ఉన్నాయనడానికి వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనలే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు.

ఆదిలాబాద్, మెదక్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ముగ్గురు రైతుల నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకున్న పాపం ముమ్మాటికీ ఈ చేతకాని సీఎం రేవంత్‌రెడ్డిదే అని మండిపడ్డారు. ఆలంపూర్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నాయకుడు విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి దుర్భాషలాడటం ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 

మల్లు రవి క్షమాపణ చెప్పాలి: హరీశ్

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే విజయుడుపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి చేసిన దాడిని మాజీ మంత్రి హరీశ్‌రావు ఖండించారు. ఈ ఘటనను బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.