26 August, 2026 | 9:52 AM

పర్యావరణ పరిరక్షణలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలి

26-08-2026 08:44 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): పర్యావరణ పరిరక్షణలో ప్రతీఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచులు కలకోట్ల శైలేందర్,కర్నాటి వెంకన్న,నున్న యాదగిరి యాదవ్ అన్నారు.మంగళవారం మండల పరిధిలోని అడివెంల,రామన్నగూడెం,కోమటిపల్లి గ్రామాలలో వన మహోత్సవం సందర్భంగా పాఠశాల ఆవరణలో పాటు ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పచ్చదనం పెంపొందించడంతో పాటు భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన,ఆరోగ్యకరమైన వాతావరణ అందించేందుకు ప్రతీ ఒక్కరు ఒక్క మొక్క నాటాలని సూచించారు.ఆయా కార్యక్రమాల్లో ఉపసర్పంచులు లింగంపల్లి రవీందర్,వజ్జె చిన్న రవి,మాండ్ర గోవర్ధన్,వార్డు సభ్యులు,ఎఫ్ఏలు,ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.