17 April, 2026 | 10:26 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఆసుపత్రిలో హెచ్‌ఈఓ, ఆయా తప్ప అందరూ గైర్హాజరే..

19-11-2025 12:47 AM

అహ్మదీపూర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా అతనికి చేసిన కలెక్టర్ 

గజ్వేల్, నవంబర్ 18 : గజ్వేల్ మండలం అహ్మదీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్‌ఈఓ, ఆయా తప్ప అందరూ గైహాజరయ్యారు. మంగళవారం గజ్వేల్ మండలంలోని అ హ్మదీపూర్ పిహెచ్ సి ని జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించారు.

సమయం ఉదయం 9.34 గంటలు అయిన కూడా ఎచ్ ఈ ఓ సత్యనారాయణ రెడ్డి, ఆయమ్మ తప్ప మెడికల్ ఆఫీసర్ తో సహా మిగిలిన సిబ్బంది అందరూ గైర్హాజరు కావడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి గైర్హాజరు అయిన వారి వివరాలను నమోదు చేసి ఒక రోజు జీతం కోత విధించాలని, సమయానికి రాకుండా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డి ఎం అండ్ ఎచ్ ఓ నీ ఫోన్ ద్వారా ఆదేశించారు.