22 April, 2026 | 8:29 PM

త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని ఉమ్మడి జిల్లా సందర్శించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు

22-04-2026 06:57 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని తాండూరు గ్రామంలో ఉన్న ప్రసిద్ధిగాంచిన త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు చైర్ పర్సన్ సిజిఆర్ఎఫ్-II టిజి.ఎన్.డి.సి ఎల్ నిజామాబాద్ ఎరుకల నారాయణ,మెంబర్ అఫ్ టెక్నికల్, టిజి.ఎన్.డి.సి.ఎల్ నిజామాబాద్ సలద్ర రామకృష్ణ, నెంబర్ ఆఫ్ ఫైనాన్స్, టిజి.ఎన్.డి.సి.ఎల్ నిజామాబాద్ షేర్ల సత్యనారాయణ, ఫోర్త్ మెంబర్ సిజిఆర్ఎఫ్ నిజామాబాద్ మర్రిపల్లి రాజా గౌడ్లు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.ఆలయానికి విశిష్టత గురించి ఉన్నత స్థాయి అధికారులకు తెలియజేశారు.గ్రామ సర్పంచ్ యాద గౌడ్,ఉప సర్పంచ్ ముత్యాల అభిషేక్ శాలువాతో ఘనంగా సన్మానించారు.