10 May, 2026 | 9:07 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

శ్రీ చైతన్య పాఠశాలలో ఎన్నికల సందడి

29-11-2025 12:00 AM

కరస్పండెంట్ బిడారి సతీష్

ధర్మపురి,నవంబర్28(విజయక్రాంతి):విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు అలవరచుకోవాలన్నారు శ్రీచైతన్య పాఠశాల కరస్పండెంట్ బిడారి సతీష్ పేర్కొన్నారు. వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులకు పాఠశాల ఎన్నికలు నిర్వహించారు.ఈ ఎన్నికలలో అబ్బాయిల నుండి నలుగురు గురు పోటీ చేయగా పి.అక్షిత్ కుమార్, అమ్మాయిల నుండి ఎనిమిది మంది పోటీ చేయగా ఎ.వర్షిత లు విజయం సాధించారు.

ఇరువురికి రిటర్నింగ్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహించిన మమత విజయం సాధించిన విద్యార్థులకు హెడ్ బాయ్, హెడ్ గర్ల్ కి పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బిడారి సతీష్ మాట్లాడుతూ ప్రతి పండుగ కు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పిల్లలకు ఎన్నికలపై అవగాహన కల్పించాలని ఎలక్షన్ ను గత రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో ఈ ఎన్నికలు విష్యర్థులకు ఎంతో ఉపయోగపడుతాయనీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ ఎ. జ్యోతి, రాజేష్, సమత, వనజ, ఆండాళ్, రజిత, కళ్యాణి, సంధ్య, మల్లీశ్వరి, రజిత, అంజలి, మంజు భార్గవి, నవ్య, అనూష, సాహితి, శిరీష, కార్తిక, స్వప్న, సువర్ణ, శిరీష, మానస ,అనిత విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.