ఖానాపూర్ లైబ్రరీలో విద్యా వారోత్సవాలు
15-05-2026 07:23 PM
పదివేల రూపాయల పోటీ పరీక్షల పుస్తకాలను అందజేసిన ఉపాధ్యాయుడు వాల్గోట్ కిషన్
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ గ్రంథాలయంలో విద్యా వారోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఖానాపూర్ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వాల్గోట్ కిషన్ విద్యార్థులకు సుమారు పదివేల రూపాయల విలువగల పోటీ పరీక్షల పాఠ్య పుస్తకాలను గ్రంధాలయానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధించి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు తుడసం ఇందిరా, నాయకులు అంకం మహేందర్ ,మేసా సతీష్, ఖానాపూర్ లైబ్రేరియన్ శ్రీ పృథ్వి, మండల విద్యాశాఖ అధికారి సంధ్యారాణి, ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి, పాఠకులు పలువురు పాల్గొన్నారు.






