15 May, 2026 | 8:14 PM

Breaking News

పరీక్ష కేంద్రం వద్ద చల్లటి నీరు, అంబలి పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న   •   జవహర్ నవోదయ పాఠశాలకు భూమి స్వాధీనం.. రైతులతో చర్చించి సరిహద్దుల ఖరారు   •   ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి   •   మలిదశ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్   •   ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం   •   ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడం సిగ్గుచేటు   •   దొంగలు... బాబోయ్... దొంగలు...   •   చెంచుల జీవనోపాధికి టీజీఐఎల్పీ కీలకం   •   మోడీది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు.. రెండు నాలుకల సర్కార్   •   మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సోమయ్య   •  

ఖానాపూర్ లైబ్రరీలో విద్యా వారోత్సవాలు

15-05-2026 07:23 PM

పదివేల రూపాయల పోటీ పరీక్షల పుస్తకాలను అందజేసిన ఉపాధ్యాయుడు వాల్గోట్ కిషన్

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ గ్రంథాలయంలో విద్యా వారోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఖానాపూర్ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వాల్గోట్  కిషన్ విద్యార్థులకు సుమారు పదివేల రూపాయల విలువగల పోటీ పరీక్షల పాఠ్య పుస్తకాలను గ్రంధాలయానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధించి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు తుడసం ఇందిరా, నాయకులు అంకం మహేందర్ ,మేసా సతీష్, ఖానాపూర్ లైబ్రేరియన్ శ్రీ పృథ్వి, మండల విద్యాశాఖ అధికారి సంధ్యారాణి, ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి, పాఠకులు పలువురు పాల్గొన్నారు.