18 July, 2026 | 6:55 PM

Breaking News

నాణ్యమైన విద్యకు కేరాఫ్ ప్రభుత్వ పాఠశాలలు   •   పరిసరాల సేవా వీరులు   •   మిర్యాల కాంగ్రెస్ కార్యకర్త మెంచు లింగమల్లు దశదిన కర్మకు ఆర్థిక సహాయం   •   ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అంత్యంత కీలకం   •   విద్యార్థులలో క్రమశిక్షణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యాభివృద్ధి   •   'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి   •   గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి   •   తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •   అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •  

‘కపాస్ కిసాన్’ యాప్ మాకొద్దు

10-10-2025 12:25 AM

బోథ్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): రైతు లు పండించిన పత్తి పంటలు అమ్ముకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కపాస్ కిసాన్ యాప్‌ను జిల్లాలో పలువురు రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ యాప్‌పై ఇప్పటి రైతుల్లో గందరగోళం నెలకొనగా తా జా,  జిల్లాలోని సొనాల మండలం చింతల్ బోరి గ్రామ రైతులు సీసీఐ ద్వారా ప్రవేశపెట్టి న కపాస్ కిసాన్ యాప్‌ను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ మేరకు గురువారం వ్యవసాయ శాఖ అధికారికి రైతులు వినతిపత్రం అందించారు. ఈ యాప్ రైతుల పాలిట శాపంగా మారిందని రైతులు విమర్శించారు. ఈ యాప్ వినియోగంలో   నిరక్షరాస్యులైన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ యాప్‌ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.  ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ కపా స్ కిసాన్ యాప్‌ను  బ్యాన్ చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.