18-02-2026 01:10:10 AM
ఇల్లెందు, ఫిబ్రవరి 17, (విజయక్రాంతి): ఇల్లెందు మున్సిపల్ చైర్ పర్సన్ గా రెండవ వార్డు కౌన్సిలర్ దొడ్డ కిరణ్ మిత్రను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా 17వ వార్డు కౌన్సిలర్ పెండేల రాజు ఎన్నికయ్యారు. ఇల్లెందు మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో 24 వార్డులకు 19 కాంగ్రెస్ ’హస్త’గతం చేసుకోగా ఇండిపెండెంట్ లు ఇద్దరు, బిఆర్ఎస్ 3 సీట్లను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
సోమవారం చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక జరగాల్సినప్పటికీ చైర్మన్ వైస్ చైర్మన్ ల ఎంపిక విషయంలో పోటీ ఉండడంతో మంగళవారానికి వాయిదా పడింది. ఎమ్మెల్యే కోరం కనకయ్య చైర్మన్ వైస్ చైర్మన్ ల ఎంపిక అధిష్టానం నిర్ణయిస్తుందని పేర్కొనడంతో అనేక ఊహాగానాలు నడుమ మంగళవారం చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక ప్రశాంతంగా ముగిసింది. ఇల్లందు నూతన పాలక వర్గానికి ఎమ్మెల్యే కోరం కనకయ్య శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణ అభివృద్ధికి కౌన్సిలర్లు అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు. నూతన సభ్యులచే ఆర్డీవో మధు ప్రమాణ స్వీకారం చేయించారు.