దివ్యాంగులకు పండ్లు పంపిణీ
06-05-2026 04:09 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన రిటైర్డు ఎమ్మార్వో ఉమా శంకర్ స్వరూప రాణి దంపతుల కుమారుడు శ్రావణ్ కుమార్ 33 వ జన్మదినం పురస్కరించుకొని బుధవారం సుల్తానాబాద్ పట్టణంలోని వికాసం దివ్యాంగుల పునరావాస కేంద్రంలోని దివ్యాంగులకు కర్బూజా, దోసకాయ, అరటి పండ్లు , కూల్ డ్రింక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులు శ్రావణ్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు,






