23 June, 2026 | 2:25 PM

Breaking News

పోతారంలో చిన్న వానకే చెరువులా ప్రధాన రహదారి   •   ఏసీబీకి చిక్కిన నిజామాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్   •   శ్యామా ప్రసాద్ ముఖర్జీ త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం   •   రవీంద్రభారతిలో కవి ద్యావరి నరేందర్ రెడ్డికి ఘన సత్కారం   •   సర్వే నంబర్ 218 బాధితులకు అండగా పువ్వాడ అజయ్ కుమార్   •   ప్రభుత్వం గుర్తించిన ఏడు సన్న రకాలను సాగు చేస్తేనే రైతులకు బోనస్   •   గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి   •   డ్రైనేజీ సమస్యతో తేజాపూర్ వాసుల అవస్థలు   •   హైదరాబాద్ మెట్రో స్వాధీనం, విస్తరణపై చ‌ర్చలు సఫలం   •   తడిసిన ధాన్యం పేరుతో రైతుకు టోకరా!   •  

డా. శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులర్పించిన డిప్యూటీ మేయర్

23-06-2026 12:52 PM

ముకరంపుర, జూన్ 23(విజయక్రాంతి): ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జెండా అనే సమున్నత లక్ష్యంతో కాశ్మీర్ సమగ్రత కోసం తన ప్రాణాలను బలిదానం చేసిన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు,  డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ  బలిదాన్ దివస్ (వర్ధంతి) సందర్భంగా కరీంనగర్ నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు తన క్యాంప్ కార్యాలయంలో డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ  చిత్రపటానికి పూలమాలవేసి, ఆయన చేసిన సేవలను మరియు త్యాగాలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యాదగిరి సునీల్ రావుతో పాటు పలువురు బీజేపీ నాయకులు ఆంజనేయులు, అనిల్, బాలు, మహేందర్, తిరుపతి, మల్లయ్య, రాజయ్య, రోహిత్, సాయి ,తదితరులు పాల్గొన్నారు.