పాఠశాలలో సందర్శించిన డిఇఓ
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా సామర్థ్యాలు (Foundational Literacy and Numeracy – FLN) మెరుగుపరిచే లక్ష్యంతో FLN సెల్ ఆధ్వర్యంలో GPS- సాయి నగర్ (UM&TM)పాఠశాలల సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న పరిశీలించారు.
విద్యార్థుల చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలు మరియు తరగతి స్థాయి అభ్యసన సామర్థ్యాలను పరిశీలించింది. విద్యార్థుల అభ్యసన స్థాయిని ప్రత్యక్షంగా పరిశీలించి, అవసరమైన విద్యార్థులకు అదనపు అభ్యసన సహాయం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ మానిటరింగ్ అధికారి నరసయ్య, ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ ఖలీద్, సుమలత, సిఆర్పి ఫిరోజ్ పాల్గొన్నారు.






