9 May, 2026 | 9:18 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

శివాబాగ్ కాలనీలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహణ

17-02-2026 09:16 PM

సనత్‌నగర్(విజయక్రాంతి): శివాబాగ్ కాలనీలో సైబర్ నేరాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ రమణారెడ్డి హాజరయ్యారు. అదనపు డీసీపీ శ్రీకాంత్, ఏసీపీ రాఘవేంద్ర రావు, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస రెడ్డి, ఎస్‌ఐ రాజు రాథోడ్, మధు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, రోజురోజుకీ పెరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీలు, బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియజేయరాదని తెలిపారు.

సోషల్ మీడియాలో అపరిచితుల నుండి వచ్చే లింకులు, మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదైనా సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని, అలాగే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలియజేశారు. యువత, మహిళలు ప్రత్యేకంగా సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. స్థానికులు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ.. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు తరచూ నిర్వహించాలని కోరారు.