20 March, 2026 | 7:19 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

అర్ధరాత్రి నగరంలో సీపీ తనిఖీలు

08-10-2025 01:13 AM

 పరువురికి కౌన్సిలింగ్ హెచ్చరిక 

నిజామాబాద్ అక్టోబర్ 7 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లాలో  శాంతి భద్రతల పరిరక్షణకై ప్రతిష్టమైన చర్యలు చేపడుతున్న నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం అర్ధరాత్రి ఆకస్మిక  తనిఖీలు నిర్వహించారు.  నగరంలోని పలు ప్రాంతాలతో పాటు రైల్వే స్టేషన్ బస్టాండ్ లలో ఆకస్మిక తనిఖీ లు నిర్వహించారు.  అర్ధరాత్రి సమయంలో నిజామాబాద్ నగరంలో ప్రధానమైన  రైల్వే స్టేషన్ , ఆర్టిసి బస్టాండ్ , గాంధీచౌక్ , నెహ్రూ పార్క్, శివాజీ నగర్ , కంటేశ్వర్,  దేవీ రోడ్డు , ఫ్లై ఓవర్ బ్రిడ్జి తదితర ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.   

నిజామాబాద్ జిల్లాతో పాటు నగరం లో ఎలాంటి నేరాలు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా బయటి ప్రాంతాలలో నుండి వచ్చి ఇక్కడ రైల్వే స్టేషన్ ఆర్టిసి బస్టాండ్ పరిసర ప్రాంతాలలో ఉంటూ ఎలాంటి కారణము లేకుండా బయట తిరుగుతున్న వారిని సైతం సిపి తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా అసందర్భంగా కనిపించిన వారందరికీ  కౌన్సిలింగ్  నిర్వహించారు.  రాత్రి సమయాలలో మళ్లీ కనిపిస్తే వారిపై చట్టపరమైన కేసులు నమోదుచేస్తామని సిపి హెచ్చరించారు.