6 May, 2026 | 10:33 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

పత్తి కొనుగోలు సీసీఐ తిరకాసు

24-02-2026 01:02 AM

ఆదిలాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): పత్తి పండించే అన్నదాతకు కష్టాలు వీడటం లేదు. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలతో దిగుబడి తగ్గి కుదేలవుతుంటే, మరోవైపు ప్రభుత్వ కొనుగోలు సంస్థ ‘కాటన్ కార్పొ రేషన్ ఆఫ్ ఇండియా’ (సీసీఐ) విధిస్తున్న కఠిన నిబంధనలు రైతులను కుంగదీస్తున్నాయి. నాణ్యత, తేమ శాతం పేరిట అధికారులు పెడుతున్న కొర్రీలతో మద్దతు ధర దక్కక రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. పత్తి కొనుగోళ్లలో  సీసీఐ గడువు పెంచినప్పటికీ నాణ్యత పేరిట కొనుగోళ్లకు ముందుకు రాకపోవడంతో రైతుల ఆందోళన చెందుతున్నారు.

ఈనెల 20 వరకే పత్తి కొనుగోలు చేస్తామని సీసీఐ ప్రకటించినప్పటికీ ఆ గడువురు ఈనెల చివరికి పెంచింది. కిసాన్ యాప్‌లో రైతులు స్లాట్ బుక్ చేసుకొని మార్కెట్ యార్డ్ కు రాగా నాణ్యత పేరిట కొనుగోలులకు సీసీఐ అధికారులు ముందుకు రాలేదు. సోమవారం ఒకే బండి కాటా చేయడంతో రైతులు మార్కెట్ యార్డ్‌లో నిరసన వ్యక్తం చేశారు. పత్తి నాణ్యతగా ఉన్నా కూడా కొనుగోళ్లకు పాసింగ్ ఇవ్వ డం లేదని మండిపడ్డారు. రైతులకు అండగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిన్ రెడ్డి సీసీఐ అధికారులతో మాట్లాడా రు. ఎలాంటి తిరకాసులు లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.