20-02-2026 02:22:18 PM
కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి
కొల్లాపూర్ టౌన్: కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను శుక్రవారం కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి టెంకాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత లోపం లేకుండా పనులు చేపట్టాలని మేస్త్రీలకు సూచించారు. నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ నిరుపేదల సంక్షేమం వారి అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటుందని తెలిపారు. పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను జూపల్లి కృష్ణా రావు ఆధ్వర్యంలో మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ షేక్ రహీం భాషా, మాజీ కౌన్సిలర్ బరిగెల రాముడు యాదవ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు.