28 June, 2026 | 2:13 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

సంక్షేమ పథకాలతోనే కాంగ్రెస్ సర్పంచ్‌లు గెలుపొందుతున్నారు

17-01-2026 01:27 AM

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు మోత్కుపల్లి రాములు

మొయినాబాద్, డిసెంబర్ 17 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే అధిక స్థానంలో గెలుపొందుతూ ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథంలో ఉన్నారని రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు మోత్కుపల్లి రాములు అన్నారు. బుధవారం మండల పరిధిలోని మోత్కుపల్లి గ్రామంలో గ్రామ సర్పంచిగా గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంపూర్ణ రాములును వివిధ గ్రామాల నుంచి గెలుపొందిన సర్పంచులు అభిమానులు నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆమెను సన్మానించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు రాములు పాల్గొని సర్పంచిని అభినందిస్తూ సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే సర్పంచుల గెలుపుకు నినాదమని సూచించారు. వచ్చే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థలు ఘన విజయం సాధిస్తారని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సాగుతుందని ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిగూడా సుజాత, సునీల్, తదితరులు పాల్గొన్నారు.