21 April, 2026 | 4:46 PM

Breaking News

ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •   అంగన్వాడీలో పోషక అభియాన్   •   ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •   మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు   •   కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •   భిక్కనూరులో 77 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

కేంద్ర కుట్రలపై కాంగ్రెస్ నిరసన

23-01-2026 08:43 PM

ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర కుట్రలపై కాంగ్రెస్ నిరసన

 తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో విధానాలు అమలు చేస్తోందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ సంగీతం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతు వ్యతిరేక చట్టాలు, వీబీజీ రామ్ జీ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గాలను దోపిడీ చేస్తోందని ఆరోపించారు. ఉపాధి హామీ చట్టం ద్వారా ప్రజలు సాధించుకున్న చట్టబద్ధమైన పని హక్కును కేంద్రం కాలరాస్తోందని తెలిపారు. కార్పొరేట్ లాభాల కోసమే పేదల జీవనాలతో చెలగాటం ఆడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానాల వల్ల పల్లెల నుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను గ్రామగ్రామాన ఎండగట్టాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు.