30 June, 2026 | 7:55 PM

Breaking News

మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు పలు దుకాణాల్లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు   •   పౌర హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదు   •   ఆర్టీసీ కార్గో సేవలు పునరుద్ధరించాలి   •   సిద్దాపూర్ రిజర్వాయర్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   సుల్తానాబాద్ మున్సిపల్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యం   •   చిన్న గాలి వానోస్తే కరెంటు గల్లంతే   •   మాదక ద్రవ్యాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   రామేశ్వరపల్లిలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభం   •   ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడి యువకుడు మృతి   •   మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •  

ఎన్.ఎస్.ఎస్. జాతీయ అవార్డ్ గ్రహీతకు అభినందనలు

08-10-2025 05:49 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): జాతీయ సేవా పథకంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నమిలగుండు పల్లె గ్రామస్థుడైన వంగపల్లి మణి సాయివర్మ విద్యార్థి వాలంటీర్ గా విశేష సేవలను గుర్తిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా జాతీయ స్థాయిలో ఉత్తమ ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్ గా అవార్డును స్వీకరించిన సందర్భంగా తెలంగాణ కుమ్మర సంఘం రాష్ట్ర శాఖ కోశాధికారి నామీలకొండ ప్రభాకర్ అభినందనలు వ్యక్తం చేశారు. తెలంగాణ కుమ్మర సంఘం కరీంనగర్ జిల్లా కార్యాలయంలో నామీలకొండ ప్రభాకర్ రాష్ట్ర కోశాధికారి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయనైనది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మణి సాయివ ర్మను స్పూర్తిగా తీసుకుని కుమ్మర సామాజిక వర్గం యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

తదుపరి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నాంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మణి సాయివర్మ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి పథకాలను ప్రజల వద్దకు చేర్చడంలో నిరంతరం కృషి చేసిన మణి సాయివర్మ కుమ్మర సామాజికవర్గానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడం హర్షణీయమని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి నాంపల్లి శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గొట్టం ధరణీధర్, సంఘ్ బాధ్యులు నాంపల్లి రవీందర్, రమేష్, తిరుపతి పాల్గొన్నారు.