28 August, 2026 | 8:09 PM

Breaking News

సీఎంకు రాఖీ కట్టిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్   •   విద్యుత్‌ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాం   •   ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమిద్దాం   •   విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి   •   డ్రై ఫ్రూట్స్‌తో రాఖీలు తయారు చేసిన చిన్నారి   •   ఏఐవైఎఫ్ మానుకోట జిల్లా నూతన కమిటీ ఎన్నిక   •   మెడినోవా ఆసుపత్రిలో ఎన్ఐసీయు వైద్య సేవలు   •   ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలి   •   రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో పారమిత విద్యార్థులకు పతకాలు   •   రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన గురుకుల డిగ్రీ అథ్లెటిక్స్ అకాడమీ క్రీడాకారిణిలు   •  

రాఖీలు కట్టి కలెక్టర్‌కు శుభాకాంక్షలు

28-08-2026 06:07 PM

భూపాలపల్లి,(విజయ క్రాంతి): రాఖీ పౌర్ణమి సందర్భంగా ఐడీఓసీ కార్యాలయంలో శుక్రవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కలెక్టరేట్ మహిళా సిబ్బంది జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సహోదరత్వం, ఆత్మీయత, పరస్పర రక్షణకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ ప్రాశస్త్యాన్ని స్మరించుకున్నారు కార్యాలయ విధుల నిర్వహణలో జిల్లా కలెక్టర్ అందిస్తున్న మార్గదర్శకత్వం, సహకారానికి మహిళా సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో మహిళా అధికారులు, సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ, వారి సంక్షేమం, భద్రతకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సీనియర్ సహాయకులు విజయ, అనురాధ, సుమలత, జూనియర్ సహాయకులు మౌనిక తదితరులు పాల్గొన్నారు.