14-02-2026 09:38:26 PM
పాల్వంచ,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో శనివారం జిల్లా స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కేటీపీఎస్ ఏడవదశ ఏడవ దశ చీఫ్ ఇంజనీర్ సూర్య నారాయణలు ప్రారంభించారు. ఈ పోటీలకు జిల్లాలోని మణుగూరు, భద్రాచలం, ఇల్లందు కొత్తగూడెం, ఖమ్మం, చర్ల, రుద్రంపూర్, పాల్వంచ జట్లు పాల్గొన్నాయి. నిర్వాహకులు రెండు రోజులు పాటు ఈ పోటీలు నిర్వహిస్తున్నామనీ కళాభారతి ఫుట్బాల్ క్లబ్ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైస్ ఓ పరంధామ రెడ్డి, ఫుట్బాల్ కప్ వ్యవస్థాపకులు సుధాకర్ రాజు, ఎస్సీ సివిల్ యుగపతి, ఆరిఫ్ పాల్గొన్నారు. రెండు రోజులపాటు జరిగే పోటీలలో గెలిచిన జట్టుకి ట్రాఫిక్ మరియు నగదు బహుమతి ఇవ్వనున్నారు. క్రీడాకారులకు భోజన వసతి సదుపాయాలు భోజనం వసతి సదుపాయాలు నిర్వాహకులు కల్పించారు.