సీఎం రేవంత్ “ప్రెస్ మీట్”. మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై ఉత్కంఠ
24-08-2026 03:35 PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం 4:00 గంటలకు హైదరాబాద్లోని డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్-29, కాన్ఫరెన్స్ హాల్లో మీడియాతో మాట్లాడనున్నారు. లండన్ పర్యటన వివరాలను రేవంత్ రెడ్డి వెల్లడించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమెరికా పర్యటన రద్దుపై సీఎం స్పందించనున్నారు. మంత్రి కొండా సురేఖ, ఆమె కూతురు కొండా సుస్మిత వివాదాస్పద వ్యాఖ్యలపై వ్యవహారంపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.






