వచ్చే 8 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలు
22-04-2026 12:00 AM
సిద్దిపేట క్రైం, ఏప్రిల్ 21 : ఈ నెల 23 నుంచి వచ్చే నెల 8 వరకు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా కమిషనరేట్పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని సూచించారు. బంద్ ల పేరిట బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజే సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు ఉన్నాయని తెలిపారు.






