17 April, 2026 | 10:04 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

నర్సింగ్ విద్యార్థినిపై కెమికల్ దాడి

02-12-2025 01:56 AM

హనుమకొండ ఘటన

మహబూబాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): హనుమకొండ నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న విద్యార్థినిపై కెమికల్ దాడి జరిగింది. సోమవారం కాజీపేట సమీపంలోని కడిపికొండ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువతిపై గుర్తుతెలియని యువకులు కెమికల్ దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

జనగామ జిల్లాకు చెందిన బాధిత యువతి హనుమకొండలోని నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ చదువుతోంది. సోమవారం సాయంత్రం సమీప బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.