26 March, 2026 | 1:59 PM

Breaking News

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి, పోలీస్ ఎస్‌హెచ్‌వోను నియమించాలి   •   ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది సున్నా   •   కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి   •   అంజన్న హుండీ లెక్కింపు ప్రారంభం   •   బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం.. ఎవరు కాజేశారో తెలుసు!   •   మార్కాపురం బస్సు అగ్నిప్రమాదం — 13 మంది సజీవ దహనం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!   •   మార్కాపురం బస్సు దుర్ఘటనపై మోదీ సంతాపం — 14 మంది మృతికి రూ.2 లక్షల పరిహారం!   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •  

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కేంద్ర బృందం పర్యటన..

08-10-2025 06:41 PM

వరదలకు కొట్టుకుపోయిన వంతెనలు, పంట పొలాలను పరిశీలన..

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో, కేంద్ర బృందం బుధవారం స్వయంగా పర్యటించారు. ఆగస్టు 27న కురిసిన అతిభారీ వర్షాలకు పోటెత్తిన వరదలతో జరిగిన పంటనష్టం, రహదారులు ధ్వంసమైన ప్రాంతాలను కేంద్ర బృందం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(District Collector Ashish Sangwan)తో కలిసి పరిశీలంచారు. నియోజకవర్గంలోని లింగంపేట మండలం లింగంపల్లి కుర్ధు బ్రిడ్జిని, ఎల్లారెడ్డి మండలంలోని పంట పొలాలను, నాగిరెడ్డి పేట మండలంలోని మంజీరా ముంపు వరదతో దెబ్బతిన్న పంట పొలాలు పరిశీలించారు. అనంతరం నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు ఓవర్ హెడ్ వద్ద మట్టి కొట్టుకుపోయిన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. కేంద్ర బృందం సభ్యులు జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో పంట నష్టం ఆస్తి నష్టానికి జరిగిన వివరాలు సేకరించారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్లు, కేంద్ర బృందం తెలిపారు.