15 May, 2026 | 8:18 PM

Breaking News

సెలవులకు ఇంటికి వచ్చిన విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి   •   బాన్సువాడలో నూతన ఆర్డీఓ క్యాంప్ కార్యాలయం ప్రారంభం   •   పరీక్ష కేంద్రం వద్ద చల్లటి నీరు, అంబలి పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న   •   జవహర్ నవోదయ పాఠశాలకు భూమి స్వాధీనం.. రైతులతో చర్చించి సరిహద్దుల ఖరారు   •   ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి   •   మలిదశ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్   •   ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం   •   ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడం సిగ్గుచేటు   •   దొంగలు... బాబోయ్... దొంగలు...   •   చెంచుల జీవనోపాధికి టీజీఐఎల్పీ కీలకం   •  

7న పాలస్తీనా సంఘీభావ ప్రదర్శనను జయప్రదం చేయండి

05-10-2025 12:48 AM

-పాలస్తీనా సంఘీభావ కమిటీ

ముషీరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆక్టోబర్ 7న హైదరాబాద్ లో నిర్వహించే పాలస్తీనా సంఘీభావ ప్రదర్శన ను జయప్రదం చేయాలనీ పాలస్తీనా సంఘీభావ కమిటీ పిలుపునిచ్చింది. హైదరాబాద్  హిమాయత్ నగర్  సత్యనారాయణరెడ్డి భవన్ లో శనివారం పాలస్తీనా సంఘీభావ కమిటీ సమావేశమైంది.

ఈ సమావేశంలో వామపక్ష ప్రజాసంఘాల నేతలు  పాలస్తీనా సంఘీభావ కమిటీ నాయకులు స్టాలిన్, మహేందర్, హన్మేష్, ఝాన్సీ, తేజ, తుడుం అనిల్ కుమార్, కర్ర దానయ్య, విజయ్, పర్వినా ఖలీద్, కృష్ణ, మునీర్ పటేల్, ఛాయాదేవి, వి. సంధ్య, అనసూయ, అరుణ, అనురాధ, సరళ, శ్రీకాంత్, జావిద్, మహేశ్, అఫ్సర్, తదితరులు పాల్గొని పాలస్తీనా సంఘీభావ ప్రదర్శన వాల్ పోస్టర్ ను విడుదల చేసారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆకాశం బాంబుల నుండి అగ్ని వర్షాన్ని కురిపిస్తూ, నరరక్త జీవనదిని చూస్తూ వికటాట్టహాసం చేస్తున్న వికృత విన్యాస నరహంతకులు బెంజిమోన్ నెతన్యాహూ, డోనాల్ ట్రంప్ అని మండి పడ్డారు. అక్టోబర్ 7న హైదరాబాద్ నగరం లో వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యలో భారీ స్థాయిలో పాలస్తీనా ప్రజలకు సంఘీభావాన్ని ప్రకటించాలని నిర్ణయించామని, సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఇందిరా పార్క్ దాకా ప్రదర్శనను జరుగుతుందని, ప్రజలందరూ పాల్గొని విజయవం తం చేయాలని వారు కోరారు.