12 July, 2026 | 6:44 PM

Breaking News

రాష్ట్ర స్థాయి ఉత్తమ సేవల పురస్కారం అందుకున్న జిల్లా వాసి   •   గాన కోకిల ఎస్.జానకికి లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఘన నివాళి   •   కుటుంబ కలహాలతో వ్యక్తి ఊరి వేసుకొని ఆత్మహత్య   •   సర్ ప్రక్రియను ఆకస్మిక తనిఖీ చేసిన తహసీల్దార్   •   ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి   •   సింగరేణి మెయిన్ హాస్పిటల్‌లో హెల్త్ క్యాంప్   •   తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు టీఆర్ఎస్ ఆవిర్భావం   •   ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ ను సందర్శించిన డివైఎస్ఓ సురేష్   •   వాహనదారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పేపర్లు, లైసెన్సులు కలిగి ఉండాలి   •   జాడ లేని వానలు... ఎండుతున్న పంటలు..   •  

బీఆర్‌ఎస్ అంటే ‘బోగస్ రాష్ట్ర సమితి’

23-03-2026 12:00 AM

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్నగర్, మార్చి 22: గత పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, ఆ పార్టీ అంటే ‘బోగస్ రాష్ట్ర సమితి‘ అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు. గత ప్రభుత్వం రూ. 8.50 లక్షల కోట్ల అప్పులు చేసిందని, దానికి నెలకు రూ. 50 కోట్ల వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్ నేతలు రాష్ట్రాన్ని డ్రగ్స్ సామ్రాజ్యంగా మార్చారని, యువత జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు. మట్టి, ఇసుక, భూములను విచ్చలవిడిగా దోచుకున్నారని ధ్వజమెత్తారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అట్టడుగు వర్గాలకు ప్రయోజనకరంగా ఉందని, విద్య, వైద్య రంగాలకు సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు.

మెస్ చార్జీల పెంపు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, రైతు భరోసా, రైతు బీమా వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు.తప్పులు చేసి ప్రజలను అగాధంలోకి నెట్టిన బీఆర్‌ఎస్ నేతలు, ఇప్పుడు సిగ్గులేకుండా విమర్శలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.