యూరప్ దేశం సైప్రస్లో పడవ బోల్తా.. 8 మంది మృతి
31-08-2026 08:58 AM
యూరప్: సైప్రస్ సమీపంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. కైరేనియా నుంచి తుర్కియేలోని టౌచుకు వెళ్తుండగా యాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో పడవలో సుమారు 270 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. రెస్క్యూ బృందాలు ఇప్పటివరకు 237 మందిని సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం అనంతరం పలువురు ప్రయాణికులు గల్లంతైనట్లు తెలుస్తోంది. వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక బృందాలు పడవ ప్రమాదానికి గల కారణాలపై కూడా దర్యాప్తు చేపట్టాయి.