21-02-2026 09:32:47 PM
మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తానన్న నూతన చైర్పర్సన్
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ మున్సిపల్ సర్వతోముఖాభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మున్సిపల్ నూతన చైర్పర్సన్ బండారి అనూష సతీష్ అన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో ఆమె బాధ్యతలు స్వీకరించారు. వేదపండితుల పంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్త పూజల అనంతరం తన సీట్లో ఆసీనులయ్యారు. సర్వమత ప్రార్ధనలతో ఆశీర్వచనాలు అందించారు.
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, కౌన్సిలర్లు ఆమెకు అభినందనలు తెలియచేసారు.తనకు పదవి దక్కేలా కృషి చేసిన ప్రతీ ఒక్కరికి అనూష కృతజ్ఞతలు తెలిపారు. 49 వార్డులలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మున్సిపల్ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మహ్మద్ రోహిత్, నాయకులు కంది శ్రీనివాస రెడ్డి, గండ్రత్ సుజాత, డీసీసీబీ మాజీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.