1 July, 2026 | 11:34 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఆద్యంతం అయ్యప్ప పడిపూజ

18-12-2025 10:17 PM

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వేడుక..

స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన కోవ లక్ష్మీ దంపతులు..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సోనేరావు, కుమారుడు సాయినాథ్ దంపతులు నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితులు చక్రవర్తుల పురుషోత్తమాచార్యుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ సందర్భంగా గణపతి, సుబ్రహ్మణ్యస్వామిలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మణికంఠుడికి అభిషేకం నిర్వహించి మెట్ల పూజ చేపట్టారు. ఈ వేడుకకు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ దంపతులు, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గాధవేని మల్లేష్, రాజంపేట సర్పంచ్ బుర్సా పోచయ్య పాటు అయ్యప్ప స్వాములు, భక్తులు, కోవలక్ష్మి అభిమానులు హాజరయ్యారు.