15 June, 2026 | 3:11 PM

Breaking News

మెట్రో నిధులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్   •   తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •  

అందుబాటులో యూరియా: కలెక్టర్

30-12-2025 01:44 AM

రంగారెడ్డి,డిసెంబర్ 29( విజయక్రాంతి ): రంగారెడ్డి జిల్లాలో యూరియా కొరత లేదని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని జిల్లావ్యాప్తంగా యూరియా సరఫరా పూర్తిస్థాయి లో కొనసాగుతోందని తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అన్ని యూరియా పంపిణీ కేంద్రాలకు అవసరమైనంత స్టాక్ అందుబాటులో ఉందని పేర్కొన్నారు. రైతులకు సౌకర్యవంతంగా, క్రమబద్ధంగా యూరియా పంపిణీ జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

అలాగే రైతులకు స్పష్టంగా కనిపించే విధంగా స్టాక్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. విక్రయ కేంద్రాలకు యూరియా సరఫరా తగినంతగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎక్కడా అంతరాయం లేకుండా స్టాక్ను అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, అవసరమైన యూరియా పూర్తిగా అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ భరోసా ఇచ్చారు.యూరియా పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పర్యవేక్షణ మరింత కట్టుదిట్టంగా చేపడతామని తెలిపారు.