calender_icon.png 16 February, 2026 | 12:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రఫ్ఫాడించిన అరుంధతి

16-02-2026 12:05:26 AM

సిడ్నీ, ఫిబ్రవరి 15: ఆస్ట్రేలియా పర్యటనలో భారత మహిళల శుభారంభం చేసింది.  సిడ్నీ వేదికగా జరిగిన తొలి టీ20లో డక్‌వర్త్‌లూయీస్ పద్ధతిన 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డి నాలుగు వికెట్లతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా మహిళల జట్టు 18 ఓవర్లలో 133 పరుగులకే ఆలౌటైంది. జార్జియో వేర్హమ్ 30, ఫోబే లిచిఫీల్ 26, ఎల్లిస్ పెర్రీ 20 రన్స్‌తో టాప్ స్కోరర్లుగా నిలిచారు.

అయితే ఈ ముగ్గురిని అరుంధతి రెడ్డినే ఔట్ చేసింది.  అనంతరం భారత మహిళల జట్టు వర్షం అంతరాయం కలిగించే సమయానికి 5.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. వర్షం ఎంతకీ ఆగకపోవడంతో అంపైర్లు డీఎల్‌ఎస్ పద్దతిన మ్యాచ్ ఫలితాన్ని తేల్చారు. భారత్ 21 పరుగుల ముందంజలో ఉండటంతో విజేతగా ప్రకటించారు. దీనితో సిరీస్‌లో భారత్ 1- ఆధిక్యంలో నిలిచింది.