18 April, 2026 | 11:33 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు

02-10-2025 12:00 AM

స్ట్రాంగ్ రూమ్ పరిశీలించిన ఎస్పీ - కలెక్టర్ 

గోపాలపేట అక్టోబర్ : స్థానిక ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికల లెక్కింపునకు స్ట్రాంగ్ రూమును ఎస్పీ గిరిధర్, అదనపు కలెక్టర్ రెవెన్యూ నాయక్ యాదయ్యలు పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ పగడ్బందీగా ఉండాలని ఎన్నికల అథారిటీ జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఆయన ఆదేశాల మేరకు బుధవారం గోపాలపేట మండలం నర్సింగాయపల్లి డిగ్రీ కళాశాలను అదేవిధంగా జేఎన్టీయూ పీజీ కళాశాలల భవనాలను పరిశీలించారు.

స్థానిక ఎన్నికల్లో గోపాలపేట వనపర్తి పాన్గల్ కొత్తకోట పెబ్బేర్ పెద్దమందడి శ్రీరంగాపురం ఏదుల రేవల్లి మండలాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ లెక్కింపు కేంద్రాలు డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయాలని మిగిలిన ఆత్మకూరు అమర్చింత మదనాపూర్ చిన్నంబావి వీపనగండ్ల మండలాలు జేఎన్టీయూ పోస్ట్ గ్రాడ్యుటి కళాశాలలో ఏర్పాటు చేసేందుకు అణువుగా ఉంటుందని వారు సూచించారు.

స్ట్రాంగ్ రూమ్ లెక్కింపు ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లను సీసీ కెమెరాలు బార్కేడింగ్ తదితర ఏర్పాట్లు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదరణపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్యను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గిరిధర్ ఆదరణపు కలెక్టర్ రెవెన్యూ భీమ్య నాయక్ అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య ఆర్డీవో సుబ్రహ్మణ్యం డి.ఎస్.పి వెంకటేశ్వరరావు తాసిల్దార్ రమేష్ రెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు కలెక్టర్ల వెంట ఉన్నారు.