15 April, 2026 | 1:51 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •  

ఆ ఊర్లో.. ఆడపిల్ల పుడితే రూ.5000

15-04-2026 12:00 AM

వినూత్న కార్యక్రమానికి అనంత్‌పేట సర్పంచ్ శ్రీకారం  

నిర్మల్, ఏప్రిల్ ౧౪ (విజయక్రాంతి): ఆడపిల్ల ఇంటికి వెలుగు అంటారు.. ఆడబిడ్డ పుడితే ఆ ఇం టికి సంతోషమే కాదు.. ఆ ఊరికే ఆనందం కలగాలని భావించారు ఆ గ్రామ సర్పంచ్.. ప్రభుత్వం అందించే సాయంతో పని లేకుండా తన సొంత డబ్బులతో ఓ మంచి కార్యానికి శ్రీకారం చుట్టారు నిర్మల్ గ్రామీణ మండలం అనంత్ పేట సర్పంచ్. మా ఊరి బంగారు తల్లి అనే పథకాన్ని ప్రవేశ పెట్టా రు. ఆ ఊరిలో ఆడబిడ్డ పుట్టిన వెంటనే.. ఆ పాప పేరు మీద బ్యాంకులో రూ. 5వేలు జమ చేయనున్నారు.

ఆ తర్వాత ప్రతినెల ఆయా పిల్లల తల్లి దండ్రులు జమ చేసుకునేలా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. దీంతో భవిష్యత్తులో ఆడ పిల్లల ఉన్నత చదువులు.. పెళ్లిళ్లకు బ్యాంకులో జమ అయిన డబ్బులు పనికొస్తాయి. తల్లి దండ్రులకు ఆర్థిక భారం కాకుండా ఉంటుంది. తాజాగా డా. బిఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఆ గ్రామ సర్పంచ్ మాదస్తు సునీత ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆ గ్రామానికి చెందిన కుంటాల శ్రావణి రాంచందర్ దంపతుల కూతురు స్మృతి పేరిట రూ. 5వేల నగదును బ్యాంకులో డిపాజిట్ చేసి ఆదర్షంగా నిలిచారు. నగదుతో పాటు రెండు శ్రీగంధం చెట్లను బహుమతిగా అందించారు. సర్పంచ్ నిర్ణయాన్ని గ్రామస్తులు అభినందించారు.