2 July, 2026 | 4:13 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

డాక్టరేట్ పట్టా పొందిన ఐఐఎంసీ కళాశాల ఆంగ్లోపన్యాసకురాలు

31-10-2025 12:00 AM

రాజ్యలక్ష్మీ కళ్యాణికు డాక్టరేట్

అభినందించిన ఐఐఎంసీ కాలేజీ అధ్యాపకులు, సిబ్బంది

ఖైరతాబాద్, అక్టోబర్ 30(విజయక్రాంతి): ఐఐఎంసీ డిగ్రీ మరియు పీజీ కళాశాల(స్వయం ప్రతిపత్తి) ఆంగ్లోపన్యాసకురాలు, పరీక్షల నియంత్రణ అధికారి సీహెచ్ రాజ్యలక్ష్మీ కళ్యాణి డాక్టరేట్ పొందారు. ఆమె అనురాగ్ విశ్వవిద్యాలయంలో పరిశోధనా అధ్యయన కోర్సును చదివి ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ జీవీఎస్ అనంతలక్ష్మి పర్యవేక్షణ లో ‘తెలంగాణ ప్రాంతంలో డిగ్రీ స్థాయిలో ఈఎల్‌టీ కరిక్యులంఆఫ్ మేనేజ్‌మెంట్‌లో స్టడీస్లో డిజైన్ థింకింగ్ అప్రోచ్ బోధనాపరమైన సమస్యలు ‘ఒక విమర్శనాత్మక అధ్య యనం’ అనే అంశంపై పరిశోధనా గ్రంథాన్ని సమర్పించి పరీక్షకుల ప్యానల్ సిఫార్సుల మన్ననలు పొందారు.

ఈ నేపథ్యంలో ఆరట్స్ అండ్ హ్యుమానిటీస్ ఫ్యాకల్టీలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) అవార్డుకు రాజ్యలక్ష్మీ కళ్యాణ అర్హత పొందినట్లు అనురాగ్ విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం డీన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మీ కళ్యాణికి కళాశాల యజ మాన్యం, అధ్యాపక, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు అభినందనలు తెలిపారు.