పోలీసుల అదుపులో ఆదివాసి నాయకులు
01-06-2026 06:31 PM
బోథ్,(విజయక్రాంతి): కొమరం భీం కాలనీలో ఆదివాసులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 2న చలో ప్రజాభవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కార్యక్రమానికి తరలి ఎందుకు సిద్దమైన తుడుం దెబ్బ నాయకులను బజార్హత్నూర్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి తరలించారు. అరెస్ట్ అయిన వాళ్ళు తులం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుదర్శన్, ఆదివాసి హక్కుల పోరాట సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నైతం రమేష్, ఉత్తం తదితరులు ఉన్నారు






