23 June, 2026 | 10:19 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌కు సమ్మె నోటీసు

07-02-2026 12:00 AM

12న భారత జాతీయ సమ్మెకు సిఐటియు పిలుపు

జూబ్లీహిల్స్,ఫిబ్రవరి 6(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 12వ తేదీన భారత జాతీయ సమ్మెను నిర్వహించనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బోరబండ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ వాణిశ్రీని సిఐటియు, ప్రజాసంఘాల నాయకులు శుక్రవారం  కలిశారు. సమ్మె నేపథ్యంలో అందు కు సంబంధించిన నోటీసును అందజేశారు.

అనంతరం ప్రజా సంఘాల నాయకుడు టి. సాయి శేషగిరిరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మికులు తమ ప్రాథమిక హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. వాటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 12వ తేదీన హైదరాబాద్లోని ఆర్టీసీ భవన్ నుంచి ఇందిరా పార్క్ వరకు నిర్వహించే భారీ ర్యాలీలో జిహెచ్‌ఎంసి కార్మికులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జోన్ సిఐటియు నాయకులు రాపర్తి అశోక్, భవన నిర్మాణ కార్మిక సంఘం జూబ్లీహిల్స్ జోన్ నాయకులు జాకటి స్వామి, దిలీప్, సికిందర్‌లున్నారు.