18 April, 2026 | 10:28 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

భూసమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయాలి

06-10-2025 09:40 PM

- బిఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, ఉప్పరిగూడ మాజీ సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి

- పొంగులేటిని కలిసి వినతిపత్రం అందజేసిన బిఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామ్ రెడ్డి

ఇబ్రహీంపట్నం: భూసమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయాలని బిఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, ఉప్పరిగూడ మాజీ సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి అన్నారు. సోమవారం సచివాలయంలోని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, తన ఛాంబర్ లో బూడిద రామ్ రెడ్డి కలిసి వినతి పత్రం అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమి రిజిస్ట్రేషన్, లే అవుట్లు, ప్లాట్లు రిజిస్ట్రేషన్, రెవిన్యూ శాఖల సమన్వయ లోపాలు భూ యజమానులు, ప్లాట్లు యజమానులు ఎదుర్కొంటున్న సమస్యల పరిస్కారం కోసం లే అవుట్ లకు ఒక ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చెయ్యాలని కోరారు. దీన్నిపై పొంగులేటి సానుకూలంగా స్పందించారాని బూడిద రాంరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ నర్సింహా రెడ్డి, ఫౌండేషన్ సభ్యులు మంగ ఐల్లేష్, రాంరెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.