7 April, 2026 | 5:06 PM

Breaking News

ఎమ్మెల్యే విజయ రమణారావుకు నిలువెత్తు దండతో ఘనంగా సన్మానం   •   చంద్ర మహంకాళి ఆలయంలో పూజలు   •   గోపాల్పేట్ శ్రీ నల్లపోచమ్మ నూతన ఆలయ కమిటీ ఎన్నిక   •   పేదల స్వంతింటి కల కాంగ్రెస్‌తోనే సాకారం: ధరావత్ వీరన్న నాయక్   •   'టచ్ చేసి చూడు.. పాకిస్థాన్‌ ముక్కలే'! పాక్‌కు భారత్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌   •   గిరిజన గ్రామంలో పోలీసుల గ్రామోత్సవం నిర్వహణ   •   రసాయనాల నియంత్రణతో క్యాన్సర్ నివారణ   •   ఘనంగా జీవీఆర్ జన్మదిన వేడుకలు   •   పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కటింగ్   •   ఐఎన్టీయుసీ కాంట్రాక్ట్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా ఎస్కే బాజీ సాహెబ్   •  

మద్యం కోసం గోపురం ఎక్కిన వ్యక్తి

04-01-2026 12:37 AM
  1. తిరుపతిలో మూడు గంటలపాటు హైడ్రామా

సురక్షితంగా కిందకు దించిన పోలీసులు

తిరుపతి, జనవరి 3 (విజయక్రాంతి): మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి శనివారం తెల్లవారుజామున భద్రతా సిబ్బంది కళ్లుగప్పి తిరుపతిలోని చారిత్రక గోవిందరా జ స్వామి ఆలయం లోపలికి వెళ్లాడు. నడిమి గోపురం పైకి ఎక్కి నానా హంగామా సృష్టించాడు. గమనించిన భక్తులు, విజిలెన్స్ సిబ్బంది ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యా రు. ఆ వ్యక్తి దాదాపు వంద అడుగుల ఎత్తు లో ఉన్న గోపురంపై కూర్చుని హల్‌చల్ చేశాడు. తనకు తాగడానికి క్వార్టర్ మద్యం, బాటిల్ ఇస్తేనే కిందకు వస్తానని భీష్మించుకుని కూర్చున్నాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తక్షణమే అక్కడికి చేరుకున్నారు.

మూడు గంటల పాటు సాగిన ఈ హైడ్రా మా.. నిందితుడు కోరినట్లు మద్యం ఇస్తామని పోలీసులు నమ్మించడంతో చివరకు సుఖాంతమైంది. అగ్నిమాపక సిబ్బంది అతడిని సురక్షితంగా కిం దకు దించారు. గోపురం ఎక్కిన వ్యక్తిని తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన కుత్తాడి తిరుపతిగా పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేశారు.  ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.