28 March, 2026 | 3:58 AM

హనుమాన్ జయంతికి గ్లింప్స్

28-03-2026 02:17 AM

2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘రామాయణం’ ఒకటి. నితేశ్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ ఇతిహాస చిత్రబృందం తాజాగా ఓ అప్‌డేట్ ఇచ్చింది. రామ నవమి సందర్భంగా నిర్మాత నమిత్ మల్హోత్రా తన సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. “ఇది మనందరికీ చెందిన కథ. మన ‘రామాయణం’ను అత్యంత చిత్తశుద్ధితో తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం.

ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి’ సందర్భంగా మా నెక్స్ గ్లింప్స్ ‘రామ’ను విడుదల చేస్తున్నాం” అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముని పాత్రలో నటిస్తుండగా సాయిపల్లవి సీతగా, యష్ రావణునిగా, సన్నీ డియోల్ హనుమంతునిగా, రవి దూబే లక్ష్మణునిగా నటిస్తున్నారు. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.