10 May, 2026 | 8:09 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

అయ్యప్ప ఆలయానికి రూ.1.18 లక్షల విరాళం

25-12-2025 02:40 AM

ఎల్లారెడ్డి, డిసెంబర్ 24 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని శ్రీశ్రీశ్రీశ్రీ అయ్యప్ప ఆలయంలోని పడి మెట్టు కోసం 1,18,000/-ల విరాళాన్ని బిజెపి నాయకుడు అయ్యప్ప భక్తుడైన సాయిరాం గౌడ్ ప్రదేశం.

గతంలో నిర్వహించిన మహా పడిపూజలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ఈ విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా బిజెపి నేత సాయిరాం గౌడ్ లక్ష 18 వేల రూపాయల చెక్కును ఆలయ కమిటీ అధ్యక్షుడు పద్మ శ్రీకాంత్ కు అందించారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి చంద్రం స్వామి, ఆలయ పూజారి శ్రీనివాస స్వామి, నగేష్ గురు స్వామి, మాజీ వైస్ ఎంపీపీ నువ్వుగొండ శ్రీనివాస్, యాదగిరి స్వామి, సంతు స్వామి తదితరులు పాల్గొన్నారు.