10-02-2026 12:00:00 AM
కారేపల్లి, ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి): కరెంటు షాక్ తో సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రానికి చెందిన కేబుల్ ఆపరేటర్ మృతి చెందిన సంఘటన సోమవారం మధ్యాహ్నం ఇల్లెందులో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కారేపల్లి రజక బజారుకు చెందిన జూపల్లి లాలయ్య(41) ఇల్లెందు మండలంలో కేబుల్ ఆపరేటర్ గా పని చేస్తూ ఉంటాడు.
ఇల్లందు కరెంట్ ఆఫీస్ సమీపంలో ఖమ్మం ప్రధాన రహదారి పక్కన డిష్ కేబుల్ విద్యుత్ స్తంభాల పై నుండి లాగే క్రమంలో కరెంటు షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మతుడు లాలయ్యకు భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సంఘటన స్థలానికి ఇల్లెందు పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.