1 July, 2026 | 11:20 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

బిల్లులు చెల్లించకుంటే పనులు నిలిపివేస్తాం

03-11-2025 06:28 PM

బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఛైర్మన్ రామారావు

కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కాంట్రాక్టులు చేసిన పనులకు బిల్లులు చెల్లించకుంటే డిసెంబర్ నుంచి పనులు నిలిపివేస్తామని బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఛైర్మన్ రామారావు హెచ్చరించారు. సోమవారం బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రేతో పాటు పలుశాఖల అధికారులకు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఇప్పటికై బిల్లుల విషయమై మంత్రులు. ముఖ్యమంత్రిని పలుమార్లు కలిసి విన్నవించడం జరిగింది. ఇస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారని వాపోయారు. నవంబర్ 30లోపు తమ బిల్లుల చెల్లించకుంటే  డిసెంబర్ నుంచి పనులు నిలిపివేస్తామని హెచ్చరించారు.