17 April, 2026 | 2:30 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

కుట్రదారులను శిక్షిస్తాం!

12-11-2025 12:42 AM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడు ఘటన వెనుక ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరిని వదలిపెట్టబోమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. సోమవారం ఢిల్లీలో జరిగిన దారుణ సంఘటన అందరినీ తీవ్రం గా కలచివేసింది అని పేర్కొన్నారు. భూటాన్‌లోని థింఫులోని చాంగ్లిమెథాంగ్ గ్రౌండ్ లో మంగళవారం జరిగిన భారీ సభలో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

భూటాన్‌లో రెండు రోజుల రాష్ట్ర పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ థింఫునకు చేరుకున్నారు, అక్కడ ఆయన గ్లోబల్ పీస్ ప్రార్థన ఉత్సవం, ఇతర అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో జరిగిన ఘోరమైన కారు పేలుడు ఘటన తనను ఎంతో కలచివేసిందని, తాను ఎంతో బాధపడుతూ భూటాన్‌కు చేరుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.

బాధిత కుటుంబాలకు ఆయన తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. మరియు ఈ దుఃఖ సమయంలో యావత్ దేశం వారికి తోడుగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. పేలు డు దర్యాప్తులో పాల్గొన్న అన్ని సంస్థలతో తాను రాత్రంతా నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని అన్నారు.

భారత అధికారులు దాడి వెనుక ఉన్న పూర్తి కుట్రను వెలికితీసి, నిందితులను చట్టం ముందు నిలబెట్టేలా చూస్తారని ఆయన ఉద్ఘాటించారు. దీని వెనుక ఉన్న కుట్రదారులను వదిలిపెట్టబోం. ఘటనకు కారకులైన వారందిరీపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు.