18 July, 2026 | 12:57 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

చివరి లబ్ధిదారుడి వరకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం

10-10-2025 12:37 AM

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 

కరీంనగర్, అక్టోబరు 9 (విజయ క్రాంతి): చివరి లబ్ధిదారుడి వరకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని రేకుర్తి బుడిగె జంగాల కాలనీలో పలువురు ఇందిరమ్మ ఇండ్ల లబ్దారుల ఇండ్లకు సుడా చైర్మన్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇల్లిస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం భూమి ఉన్న చివరి లబ్దిదారుని వరకు ఇండ్లు మంజూరు చేస్తుందని తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఆలస్యమైనందున అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదని మిగిలిన అర్హులకు ఇండ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అస్తపురం రమేష్, పర్వతం మల్లేశం, అస్తపురం తిరుమల, మ్యాక శ్రీనివాస్, దుబ్బుల రాజయ్య, లింగంపల్లి లచ్చయ్య, తదితరులుపాల్గొన్నారు.